Krithi Shetty |‘ఉప్పెన’ చిత్రంతో యువతరాన్ని ఒక్కసారిగా తనవైపుకు తిప్పుకుంది మంగళూరు సోయగం కృతిశెట్టి. అయితే ఆ సినిమా తర్వాత టాలీవుడ్లో ఈ భామ ప్రయాణం అంత సాఫీగా సాగలేదు. గత ఏడాది ఆమెకు చేదు జ్ఞాపకాల్ని మిగిల్చింది. కృతిశెట్టి నటించిన మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాల్ని దక్కించుకోలేకపోయాయి. దాంతో కథాంశాల ఎంపికలో సెలెక్టివ్గా ఉండాలని నిర్ణయించుకుందట ఈ సొగసరి.
తాజా సమాచారం ప్రకారం ఈ భామ శర్వానంద్తో జోడీ కట్టబోతున్నదని తెలిసింది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్ ఓ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో కథానాయికగా కృతిశెట్టిని ఖరారు చేశారని తెలిసింది. శర్వానంద్తో ఈ భామకిది తొలి చిత్రం కావడం విశేషం. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైందని, త్వరలో కృతిశెట్టి షూటింగ్లో పాల్గొనబోతున్నదని చెబుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది.