టాలీవుడ్కి దొరికిన మరో ఆణిముత్యం కృతి శెట్టి. తెలుగు తెరపైకి ‘ఉప్పెన’లా దూసుకొచ్చి యూత్ ఆడియన్స్ మనసు దోచుకుంది ఈ కన్నడ భామ. తొలి చిత్రంతోనే తన పర్ఫార్మెన్స్తో అదరగొట్టిన ఈ అందాల ముద్దుగుమ్మ కుర్రకారు గుండెల్లో బేబమ్మగా నిలిచింది. టాలీవుడ్లో ఇంత తక్కువ కాలంలో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న కృతి వరుస ఆఫర్స్తో దూసుకుపోతుంది.
కృతి ముందుగా హిందీలో 2019లో హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన ‘సూపర్ 30’ సినిమాలో విద్యార్థిగా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఆ తరువాత తొలిసారిగా 2021 తెలుగు సినిమా “ఉప్పెన” ద్వారా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం నాని హీరోగా వస్తున్న “శ్యామ్ సింగరాయ్” చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. అలాగే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న మూవీలో హీరో రామ్తో జతకడుతోంది కృతి శెట్టి. లింగుసామి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
సుధీర్ బాబు సరసన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చేస్తోంది. యూత్ స్టార్ నితిన్తో ‘మాచర్ల నియోజకవర్గం’ అనే మూవీలో నటించనుంది. ‘బంగార్రాజు’ మూవీలో చైతూ సరసన నటించే చాన్స్ కొట్టేసింది కృతి శెట్టి. ఇక సోషల్ మీడియాలోను చాలా యాక్టివ్గా ఉండే కృతి శెట్టి అప్పుడప్పుడు క్యూట్ పిక్స్ షేర్ చేస్తుంటుంది. తాజాగా ఈ అమ్మడు రెడ్ కలర్ డ్రెస్లో షేర్ చేసిన పిక్స్ కేక పెట్టిస్తున్నాయి. ఇవి వైరల్గా మారాయి.