టాలీవుడ్ ఇండస్ట్రీలో కృష్ణంరాజుకి ప్రత్యేక గుర్తింపు ఉంది. చిలుక గోరింక’ సినిమాతో నటుడిగా ప్రస్థానం మొదలు పెట్టిన కృష్ణంరాజు.. చివరగా అనుష్క, అల్లు అర్జున్, రానా ప్రధాన పాత్రలో నటించిన ‘రుద్రమదేవి’లో గణపతి దేవుడిగా కనిపించి అలరించారు. త్వరలో విడుదల కానున్న రాధే శ్యామ్ చిత్రంలోను కృష్ణం రాజు నటించాడని సమాచారం.
మర్యాదకు కేరాఫ్ అడ్రెస్గా నిలిచిన కృష్ణం రాజు రీసెంట్గా తన పని మనిషికి బంగారు చైన్ బహుమతిగా ఇచ్చాడట. గత 25 ఏళ్లుగా తన ఇంట్లో పని మనిషిగా పద్మ అనే మహిళ పని చేస్తుంది. ఈ క్రమంలో కృష్ణంరాజు కుటుంబ సభ్యులు.. 25 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అంటూ ఆమె చేత కేక్ కట్ చేయించారు.అనంతరం కృష్ణం రాజు సతీమణి శ్యామలా దేవి ఆమెకు గోల్డ్ చైన్ బహుమతిగా అందించింది.
ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రభాస్ సోదరి ప్రసీద సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇవి వైరల్గా మారాయి. కృష్ణంరాజు దంపతులపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.