Detective 2 | తమిళ హీరో విశాల్ అనగానే ప్రేక్షకులకు ముందుగా గుర్తుకొచ్చేది యాక్షన్ చిత్రాలే. కోలీవుడ్తో పాటు టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఇక విశాల్ నుంచి రాబోతున్న తదుపరి పూర్తి యాక్షన్ చిత్రం ‘రత్నం’. హరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. కార్తికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సినిమా అనంతరం దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నాడు విశాల్. కోలీవుడ్ దర్శకుడు మిస్కిన్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘డిటెక్టివ్’. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులో మంచి హిట్ అందుకుంది. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ రానుండగా.. ‘డిటెక్టివ్ 2’ దర్శకుడిగా మారారు విశాల్ ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ప్రత్యేక పోస్ట్ పెట్టాడు.
25 ఏండ్ల తర్వాత ఎట్టకేలకు నేను అనుకున్న ప్రయాణం మొదలైంది. నా కల, నా ఆకాంక్ష, నా మొదటి ఆలోచన ఎట్టకేలకు నా జీవితంలో నిజం కాబోతోంది. అవును, నా కెరీర్లో అత్యంత సవాలుతో కూడిన కొత్త బాధ్యతను తీసుకోబోతున్నా. దర్శకుడిగా పరిచయమవడం అన్నది నా కెరీర్లో అత్యంత సవాల్తో కూడుకున్నది. నా డైరెక్షన్లో వస్తున్నా తొలి చిత్రం #తుప్పరివాలన్2 & #డిటెక్టివ్2 కోసం లండన్ బయలుదేరాం. అజర్బైజాన్, మాల్లాల్లో షూటింగ్ చేయబోతున్నాం. దీన్ని వర్ణించడానికి మాటలు రావడం లేదు. మనం పడిన కష్టం ఎప్పుడూ వృథా కాదు అంటూ నా తండ్రి జీకే రెడ్డి, యాక్షన్ కింగ్ అర్జున్ సర్ చెప్పిన మాటలు ఎప్పుడూ మర్చిపోను. ఏది ఏమైనా, ఫలితం ఎలా వచ్చిన కలలు కనడం, వాటిని నిజం చేసుకోవడానికి ప్రయత్నించడం మానొద్దు. నటుడిగా నాకు ఈ గుర్తింపు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నా కల ఇంత త్వరగా సాకారం కావడానికి కారణమైన మిస్కిన్ సర్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అంటూ విశాల్ ట్వీట్ చేశారు.
And my journey begins finally after 25 years. My dream, my aspiration, my first thought of wat I wanna be in life has come true. Yes, I take charge of a new responsibility, the most challenging in my career,that of a debutante director. Here we go finally. Off to London,… pic.twitter.com/aiLVQZ3Bbx
— Vishal (@VishalKOfficial) March 16, 2024