Lokesh Kanagaraj | తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్ తీసింది ఐదు చిత్రాలు మాత్రమే..కానీ ఆయన అందుకుంటున్న పారితోషిక మాత్రం అక్షరాల 60కోట్లు. అతి తక్కువ సమయంలోనే అగ్ర దర్శకుడిగా ఎదగడంతో పాటు భారీ పారితోషికంతో ఆయన తమిళ చిత్రసీమలో సంచలనం సృష్టిస్తున్నారు. ప్రస్తుతం విజయ్తో ‘లియో’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు లోకేష్ కనకరాజ్. దీని తర్వాత రజనీకాంత్ 171వ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు.
ఈ సినిమాకు లోకేష్ కనకరాజ్ దాదాపు 60కోట్ల రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారని తెలిసింది. ‘లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్’లో భాగంగా వచ్చిన ‘ఖైదీ’ ‘విక్రమ్’ చిత్రాలు చక్కటి ఆదరణ సొంతం చేసుకున్నాయి. గ్యాంగ్స్టర్ డ్రామాలను జనరంజకంగా రూపొందిస్తూ ప్రతిభావంతుడైన దర్శకుడిగా పేరు పొందారు లోకేష్ కనకరాజ్.