కోలా బాలకృష్ణ హీరోగా, సాక్షిచౌదరి హీరోయిన్గా రూపొందుతున్న చిత్రం ‘నేనెవరు’. నిర్ణయ్ పల్నాటి దర్శకుడు. భీమినేని శివప్రసాద్, తన్నీరు రాంబాబు నిర్మాతలు. త్వరలోనే చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. నిర్మాత మాట్లాడుతూ ‘సెన్సారుతో పాటు అన్ని పనులను పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేస్తాం. లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్గా చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల మెప్పు పొందుతుందనే నమ్మకం వుంది’ అన్నారు. తనిష్క్ రాజన్, గీత్షా, బాహుబలి ప్రభాకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఆర్జీ సారథి.