కిరణ్ అబ్బవరం, కశ్మీర పర్దేశీ జంటగా నటిస్తున్న ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రం శుక్రవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. మురళీకిషోర్ దర్శకుడు. జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి అల్లు అన్విత్ క్లాప్నివ్వగా, నిర్మాత బన్నీవాసు కెమెరా స్విఛాన్ చేశారు. అల్లు అరవింద్ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘వినోదభరిత ప్రేమకథా చిత్రమిది. ప్రశాంత్నీల్, కిషోర్ తిరుమల వద్ద దర్శకత్వశాఖలో పనిచేసిన మురళీకిషోర్ నవ్యమైన పాయింట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నవ్విస్తూనే చక్కటి అనుభూతిని పంచుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలో వెల్లడిస్తాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: చైతన్ భరద్వాజ్, సినిమాటోగ్రఫీ: విశ్వాస్ డేనియల్.