కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మీటర్’. రమేష్ కడూరి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మాతలు. అతుల్య రవి కథానాయిక. ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ను ఈ నెల 29న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ‘ఇటీవల విడుదల చేసిన రెండు పాటలకు మంచి స్పందన లభించింది. విభిన్న కథాంశంతో రూపొందిస్తున్న పక్కా మాస్ ఎంటర్టైనర్ ఇది. కిరణ్ అబ్బవరం పాత్ర కొత్త పంథాలో ఉంటుంది. తప్పకుండా అన్ని వర్గాల వారిని మెప్పిస్తుంది’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 7న విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: వెంకట్ సి దిలీప్, సంగీతం: సాయికార్తీక్, సమర్పకులు: నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, సంభాషణలు: రమేష్ కడూరి, సూర్య, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: రమేష్ కడూరి.