King Nagarjuna – Puri Jagannath | ఈ ఏడాది నా సామి రంగా సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున. అయితే ఈ సినిమా అనంతరం నాగ్ వరుస ప్రాజెక్ట్లను లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే తమిళ నటుడు ధనుష్ – శేఖర్ కమ్ముల కాంబోలో వస్తున్న కుబేరా చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న నాగ్ దీని తర్వాత నా సామి రంగ దర్శకుడు విజయ్ బిన్నితో మరో మూవీ చేయనున్నాడు. అయితే ఈ రెండు ప్రాజెక్ట్లు కాకుండా ఒక క్రేజీ ప్రాజెక్ట్ ఇప్పుడు ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతుంది.
కింగ్ నాగార్జున ఈ రెండు సినిమాల అనంతరం డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్తో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబోలో శివమణితో పాటు సూపర్ చిత్రాలు రాగ కమర్షియల్గా భారీ విజయాలు సాధించాయి. మళ్ళీ ఫైనల్ గా ఇన్నేళ్ల తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ నుంచి హ్యాట్రిక్ ప్రాజెక్ట్ పడబోతోంది అంటూ రూమర్స్ మొదలయ్యాయి. మరి ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ఈ ప్రాజెక్ట్ కోసం అటు నాగ్ ఫ్యాన్స్తో పాటు మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. పూరీ జగన్నాథ్ ప్రస్తుతం రామ్ పోతినేనితో “డబుల్ ఇస్మార్ట్” తెరకెక్కిస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్కు సీక్వెల్గా వస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.