ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత రామ్ చరణ్ దర్శక దిగ్గజం శంకర్ దర్శకత్వంలో క్రేజీ ప్రాజెక్ట్ చేయనున్న విషయం తెలిసిందే. ఇందులో కియారా అద్వాణీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే గ్రాండ్ గా సినిమా ప్రారంభోత్సవం జరిగింది. ఈ నెలలోనే చిత్రం సెట్స్పైకి వెళ్లనుంది. ఓ ఐఏఎస్ అధికారి రాజకీయ నాయకుడిగా మారితే రాజకీయ వ్యవస్థలో వచ్చిన మార్పులు ఏమిటి అనే నేపథ్యంలో సినిమాని రూపొందించనున్నారు.
శంకర్ ఈ చిత్రాన్ని అడ్వాన్స్ డ్ వెర్షన్ లో అత్యుత్తమ సాంకేతికతతో చూపించనున్నారు. దేశ రాజకీయాల్నే కుదిపేసే కంటెంట్ తో తెరకెక్కించనున్నారని.. సినిమా స్థాయి మరో లెవల్లో ఉంటుందని ప్రచారం హోరెత్తిపోతోంది. రీసెంట్గా చిత్ర కథానాయిక కియారా మాట్లాడుతూ.. తన పాత్ర గురించి ఇప్పట్లో రివీల్ చేయలేను. కానీ పోస్టర్ ని బట్టి చూస్తుంటే ఇది రాజకీయ నేపథ్యం ఉన్న సినిమా అని అర్ధమైంది. వివాదాస్పద అంశాలతో తెరకెక్కుతుందని నేను అనుకోవడం లేదు.
చక్కని సందేశాత్మక చిత్రంగా నిలుస్తుంది. బలమైన కథ..కథనాలతో సాగుతుంది. శంకర్ మార్క్ చిత్రమని కచ్చితంగా చెప్పగలను. శంకర్ తో పనిచేయడం బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది అని పేర్కొంది కియారా. నవంబర్ నుంచి సినిమా షూటింగ్ లో జాయిన్ కానుంది. చిత్రంలో శ్రీకాంత్..సునీల్ ..అంజలి.. తమన్నా కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.