బాలీవుడ్ చిత్రసీమలో ప్రేమ వ్యవహారాలకు, బ్రేకప్ స్టోరీలకు కొదువేం ఉండదు. రోజూ ఏదో ఒక జంట ప్రేమాయణానికి సంబంధించిన వార్తలు హాట్టాపిక్గా నిలుస్తుంటాయి. ఇటీవలకాలంలో కియారా అద్వాణీ..ఆమె ప్రియుడు సిద్ధార్థ్ మల్హోత్రా బ్రేకప్ చెప్పుకొన్నారనే వార్త బాలీవుడ్లో చర్చనీయాంశమైంది. వీరిద్దరూ ‘షేర్షా’ సినిమాలో జంటగా నటించారు. అప్పుడు చిగురించిన ప్రేమ కొంతకాలం నిరాటంకంగానే సాగిందని..ఈ మధ్యే మనస్పర్థలు రావడంతో బ్రేకప్ చెప్పుకొన్నారని పుకార్లు షికార్లు చేశాయి.
ఈ రూమర్స్ను పటాపంచలు చేస్తూ ఈ ప్రేమజంట ఇటీవల సల్మాన్ఖాన్ నిర్వహించిన ఓ వేడుకలో సందడి చేశారు. చిరునవ్వులు చిందిస్తూ ఆద్యంతం ఉల్లాసంగా గడిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. తమ ప్రేమబంధంపై వస్తున్న బ్రేకప్ వార్తలకు చెక్ పెట్టేందుకు వేదికపై ఈ జంట సన్నిహితంగా కనిపించారని అభిమానులు అనుకుంటున్నారు. కియారా అద్వాణీ నటించిన తాజా చిత్రం ‘భూల్ భులయ్యా-2’ త్వరలో ప్రేక్షకులముందుకురానుంది.