విక్టరీ వెంకటేష్ డెబ్యూ మూవీ కలియుగ పాండవులు చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కుష్బూ ఆ తర్వాత తెలుగు, కన్నడ, మలయాళ భాషలతో పాటు, హిందీలో కూడా చిత్రాలు చేశారు.తమిళంలో ఎక్కువ చిత్రాలు చేసిన ఈ ముద్దుగుమ్మ వారి మనసులలో చెరగని ముద్ర వేసుకుంది.అందుకే ఆమెకు గుడులు కట్టి పూజలు చేశారు.
ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉంటున్న కుష్బూ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పలు పోస్ట్లు పెడుతూ అలరిస్తుంది. రీసెంట్గా కుష్బూ స్లిమ్ లుక్లోకి మారిన ఫొటోలు షేర్ చేసింది. ఇందులో కుష్బూ ని చూసిన అభిమానులకు పాత రోజులు గుర్తొచ్చాయి. యాభైఏళ్ల కుష్బూ 25 ఏళ్ల అమ్మాయిలా దర్శనం ఇవ్వడంతో అభిమానులు కంగుతిన్నారు.
కుష్బూ ఫొటొలని చూసిన ఓ నెటిజన్ ఏకంగా పెళ్లి ప్రపోజల్ పెట్టేశాడు. మేడం మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను? అని అడిగేశాడు. ఆ నెటిజన్ పెట్టిన కామెంట్కు కుష్బూ స్పందించారు. ఓ.. సారీ.. నువ్ ఒక 21 ఏళ్ల క్రితం పుట్టి ఉండాల్సింది..సరేలే ఒకసారి మా ఆయన్ను అడుగుతాను అని సెటైర్ వేశారు. ఆతరువాత మరో నెటిజన్.. మీ ఆయన్ను అడిగావా? ఏం సమాధానం చెప్పారు? అని అడగ్గా, ఆయనకు ఒక్కగానొక్క భార్యని అంటా.. నన్ను వదిలేసుకోలేరంటా? అందుకే సారీ అని ఫన్నీ ట్వీట్ వేశారు.
మొత్తానికి ఇలా పెళ్లి ప్రపోజల్స్తో కుష్బూ చేసిన ట్వీట్ వైరల్గా మారాయి. ప్రస్తుతం శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో నటిస్తున్నారు. అలానే రజనీకాంత్ అన్నాత్తె చిత్రంలో నటించారు.