‘కేజీఎఫ్’ రెండు భాగాల సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు కన్నడ హీరో యష్. ఆయన నటించిన ‘సంతు స్ట్రైట్ ఫార్వార్డ్’ సినిమా శాండల్వుడ్లో ఘన విజయం సాధించింది. ఈ చిత్రంలో యష్ సతీమణి రాధిక పండిట్ నాయికగా నటించింది. మహేష్ రావ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను పద్మావతి పిక్చర్స్ సంస్థ తెలుగులో ‘రారాజు’ పేరుతో విడుదల చేస్తున్నది. ఈ సందర్భంగా నిర్మాత వీఎస్ సుబ్బారావు మాట్లాడుతూ…‘రొమాంటిక్ యాక్షన్ చిత్రమిది. హీరో యష్ ఆయన సతీమణి కలిసి నటించారు.
కన్నడలో మంచి విజయం సాధించింది. ‘కేజీఎఫ్’ తర్వాత యష్ క్రేజ్ టాలీవుడ్లోనూ పెరిగింది. దాంతో ఈ సినిమాను ‘రారాజు’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. త్వరలో విడుదల తేదీని వెల్లడిస్తాం’ అన్నారు. కిక్ శ్యామ్, సీత, రవిశంకర్ ఇతర పాత్రలు పోషించారు.