‘తొందరపడితే చరిత్రను తిరగరాయలేం. ఊరికే చరిత్రను సృష్టించలేమన్నది రాఖీభాయ్ నమ్మే సిద్ధాంతం. తన శత్రువుల్ని ఎదురించడానికి అతడు ఎలాంటి పోరాటం సాగించాడో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే’ అంటున్నారు యష్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘కేజీఎఫ్ ఛాప్టర్-2’. ప్రశాంత్ నీల్ దర్శకుడు. విజయ్ కిరగందూర్ నిర్మాత. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదలచేయబోతున్నట్లు ఆదివారం చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ను విడుదలచేశారు. నిర్మాత మాట్లాడుతూ “కేజీఎఫ్ ఛాప్టర్ 1’కు కొనసాగింపుగా రూపొందుతున్న చిత్రమిది. బంగారు గనులపై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న వారిని రాఖీభాయ్ ఎలా ఎదురించాడన్నది ఆసక్తికరంగా ఉంటుంది. సంజయ్దత్, రవీనాటండన్, ప్రకాష్రాజ్తో పాటు ప్రతి పాత్రకు ప్రాముఖ్యత ఉంటుంది’ అని తెలిపారు. తెలుగులో ఈ సినిమాను వారాహి చలనచిత్రం సంస్థ విడుదలచేస్తోంది.