టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ మహేష్- నమ్రతలు ఇప్పటికీ ఎవర్గ్రీన్ కపుల్ అని చెప్పవచ్చు. ఆ జంటని చూసి అభిమానులు మైమరచిపోతుంటారు. అయితే సినిమా షూటింగ్స్తో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలతో చక్కర్లు కొట్టే మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట షూటింగ్ కోసం స్పెయిన్ వెళ్లాడు. విదేశాల్లో జరుగుతున్న ఈ షూటింగ్కు తన ఫ్యామిలీని కూడా తీసుకెళ్లాడు.మహేష్ బాబు సినిమాతో బిజీగా ఉంటే నమ్రత షాపింగ్స్ చేసుకుంటుంది.
తాజాగా సర్కారు వారి పాట సెట్లో నమ్రత ప్రత్యక్షం అయింది. హీరోయిన్ కీర్తీ సురేష్ తో మహేష్ భార్య నమ్రత కలిసి మాట్లాడుతున్న పిక్ ఒకటి బయటకి వచ్చింది. ఇందులో వారు ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ ఎంతో జాయ్ గా మాట్లాడుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఈ బ్యూటీఫుల్ పిక్ తెగ వైరల్ అవుతుంది. చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.