బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ జూలై 16, 1983లో హాంకాంగ్లో జన్మించింది. నిన్న ఈ అమ్మడు 38వ వసంతంలోకి అడుగుపెట్టడంతో ఇండస్ట్రీకి చెందిన సెలబ్సే కాక పలువురు సన్నిహితులు, శ్రేయోభిలాషులు కత్రినాకు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే తనకు విషెస్ తెలియజేసిన వారందరికి కత్రినా క్యూట్ పిక్ షేర్ చేస్తూ కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ పిక్లో కత్రినా స్విమ్మింగ్ పూల్లో క్యూట్ స్మైల్ ఇస్తూ కనిపించింది.
‘బూమ్’ సినిమాతో నటిగా కెరీర్ ఆరంభించిన కత్రినా కైఫ్ తొలి చిత్రంలోనే అమితాబ్ బచ్చన్తో కలిసి నటించే ఆఫర్ కొట్టేసింది. ఆ తర్వాత ‘మల్లీశ్వరి’ సినిమాతో టాలీవుడ్లో రంగప్రవేశం చేసింది. ఈ సినిమాకు ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డును కూడా అందుకుంది. ‘చిక్నీ చమేలీ’, ‘షీలాకీ జవానీ’ అంటూ ఐటం సాంగ్స్తోనూ అదరగొట్టిన కత్రినా బాలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది.