గత కొద్ది రోజులుగా బీటౌన్లో కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ పెళ్లికి సంబంధించి జోరుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. బుధవారం సాయంత్రం హల్దీ వేడుక, ఆ తరువాత సంగీత్ అనంతరం డిసెంబర్ 9, గురువారం మధ్యాహ్నం సిక్స్ సెన్సెస్ బార్వారా ఫోర్ట్ వేదికగా సెహ్రా బంద్ వేడుక తర్వాత ఈ జంట పెళ్లి చేసుకోనుందని సమాచారం. అయితే వేడుకకి సంబంధించి ఎలాంటి ఫొటోలకు బయటకు రాకుండా ఈ జంట జాగ్రత్త పడుతున్నారట.
తాజాగా కత్రినాకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలు కత్రినా మెహందీ వేడుక ఫొటోలే అనే ఊహాగానాలు విన్పిస్తున్నాయి. ఈ పిక్స్ లో కత్రినా బంగారు అంచుతో పాస్టెల్ ఆకుపచ్చ కంజీవరం చీరను ధరించింది. ఆమె చేతులపై అందమైన మెహందీ ఉంది. పిక్స్ లో ఆమె వేడుకలను చాలా ఎంజాయ్ చేస్తూ కనిపిస్తుంది. అయితే ఇవి నిజంగా కత్రినా మెహందీ వేడుక నుండి లీకైన ఫోటోలు కాదు.
ఒక జ్యువెలరీ బ్రాండ్ యాడ్ కు సంబంధించినవి. ఇందులో పెళ్లికూతురు మాదిరిగా కనిపిస్తుండే సరికి తెగ వైరల్ చేస్తున్నారు అభిమానులు. వెడ్డింగ్కు సంబంధించి ఏ ఒక్క ఫోటో కూడా బయటకు రాకుండా పకడ్బంది ఏర్పాట్లు చేసారట వెడ్డింగ్ ప్లానర్స్. వెడ్డింగ్ ప్లానర్లు ముఖ్య అతిథుల కోసం 8 నుండి 10 టెంట్లను బుక్ చేశారట. వీటికి రాత్రికి రూ.70 వేలు ఖర్చవుతుందట. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తదితర తారలతోపాటు, క్రికెటర్ విరాట్-అనుష్కతో ఈ వివాహానికి రావచ్చని అంచనా. నేహా ధూపియా, అంగద్ బేడీ దంపతులు, సినీ దర్శకుడు కబీర్ ఖాన్ , ఆమె భార్య మినీ మాథుర్, నటి శార్వారీ బాగ్, రోహిత్ శెట్టి ఇప్పటికే వెడ్డింగ్ డెస్టినేషన్కు చేరుకున్న విషయం తెలిసిందే.