Vijay Sethupathi | ఒక వైపు స్టార్ హీరోగా కొనసాగుతూనే పాత్ర నచ్చితే క్యారెక్టర్ ఆర్టిస్టుగా పనిచేయడానికి సిద్ధంగా ఉండే ఒకే ఒక్క నటుడు విజయ్ సేతుపతి. తమిళంలో ఈయనకు మంచి క్రేజ్ ఉంది. ‘ఉప్పెన’ సినిమాతో తెలుగులోనూ మంచి క్రేజ్ను ఏర్పరుచుకున్నాడు. ప్రస్తుతం ఈయన నటించిన లేటెస్ట్ చిత్రం ‘కన్మణి రాంబో ఖతిజా’. నయనతార, సమంత హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి నయనతార బాయ్ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించాడు. చిత్ర బృందం మొదటి నుంచే ప్రమోషన్లను విభిన్నంగా చేస్తూ ప్రేక్షకులలో అటెన్షన్ను క్రియేట్ చేశారు. తాజాగా ఈ చిత్రంలోని ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు.
‘ఖుషీ’లోని పవన్, భూమిక దీపం ఆర్పోకుండా చేతులు అడ్డుపెట్టే సీన్ను ఈ ముగ్గరు పేరడీ చేస్తూ ట్రైలర్ ప్రారంభమైంది. ఈముగ్గరు మధ్య వచ్చే సన్నివేశాలు ఆధ్యాంతం నవ్వులు పూయిస్తున్నాయి. ‘టైటానిక్’ షిప్ సీన్, ‘బాహుబలి-2’ ప్రభాస్, అనుష్క బాణాలు వేసే సీన్స్ ఇలా సినిమాలలో సీన్స్ పేరడీ చేస్తూ డిఫరెంట్గా సినిమాను తెరకెక్కించాడు. ‘ఐ లవ్ యూ టూ.. ఐ మ్యారి టూ’ అంటూ విజయ్ చెప్పే డైలాగ్స్ హస్యాస్పదంగా ఉన్నాయి. రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 28న తమిళంతో పాటు తెలుగులోనే ఏకకాలంలో విడుదల కానుంది.