యంగ్ హీరో కార్తికేయ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నాడు. ఆగస్ట్ 22న హైదరాబాద్లోని ప్రైవేట్ హోటల్లో నిశ్చితార్థం జరుపుకోగా, ఈ కార్యక్రమానికి బంధువులు, శ్రేయోభిలాషులు,ఇండస్ట్రీకి చెందన పలువురు సెలబ్స్ హాజరయ్యారు.అయితే కార్తికేయ చేసుకోబోయే అమ్మాయి స్వస్థలం ఎక్కడ,లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా అనే అనుమానాలు అందరిలో ఉండగా,దానిపై క్లారిటీ ఇచ్చాడు కార్తికేయ.
2010లో నిట్ వరంగల్లో లోహిత రెడ్డిని కలిసానని చెప్పిన కార్తికేయ దశాబ్ధకాలంగా ఆమెతో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు.నా ప్రాణ స్నేహితురాలితో నిశ్చితార్థం జరిగింది. ఇక ముందు కూడా మధుర క్షణాలే. అంటూ కార్తికేయ తన ట్విట్టర్ ద్వారా పేర్కొన్నాడు.
బెస్ట్ఫ్రెండ్ లోహితతో త్వరలోనే తన వివాహం జరుగనుందని సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేసిన ఆయన నిశ్చితార్థ ఫొటోలతో పాటు పాత ఫొటోలను కూడా షేర్ చేశాడు. కార్తికేయ.. ఆర్ఎక్స్ 100 చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకోగా ఆ తర్వాత గుణ 369, 90 ఎంఎల్, చావు కబురు చల్లగా వంటి సినిమాలతో పలకరించాడు. నానీ గ్యాంగ్లీడర్ మూవీలో విలన్గా ఆకట్టుకున్న అతడు.. ప్రస్తుతం అజిత్ వాలిమై, రాజా విక్రమార్క అనే చిత్రాల్లో నటిస్తున్నాడు.