కార్తికేయ, అఖిల నాయర్ జంటగా ఎన్.శ్రీనివాసరావు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘వాడు ఎవడు’. ఈ సినిమా ఫస్ట్లుక్ పోస్టర్తో పాటు టీజర్ను గురువారం సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘టీజర్ చాలా బాగుంది. యథార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అన్నారు. ‘వైజాగ్లో జరిగిన యథార్థ ఘటనల స్ఫూర్తితో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. సమాజంలోని మహిళా సమస్యల్ని చర్చిస్తూ ఈ సినిమా సాగుతుంది. ఈ చిత్రం ద్వారా నేటి సమాజానికి మంచి సందేశాన్నందిస్తున్నాం’ అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: విజయ్ గండ్రకోటి, సంగీతం: ప్రమోద్ కుమార్, కథ, మాటలు, స్క్రీన్ప్లే: రాజేశ్వరి పాణిగ్రహి, నిర్మాత, దర్శకత్వం: ఎన్.శ్రీనివాస రావు.0 pt