విశాల్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘లాఠీ’. సునైనా నాయికగా నటిస్తున్నది. రానా ప్రొడక్షన్స్లో రమణ, నందా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ను బుధవారం చిత్రబృందం విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు ఎ వినోద్ మాట్లాడుతూ..‘సమాజంలో మార్పు తెచ్చే శక్తి లాఠీకి ఉంది. అన్ని భాషలకూ ఒకే టైటిల్ పెట్టాం. యాక్షన్ ప్రధానంగా సాగే కమర్షియల్ చిత్రమిది. ప్రస్తుతం స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో పోరాట సన్నివేశాల రూపకల్పన చేస్తున్నాం అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : బాలసుబ్రమణ్యన్, సంగీతం : సామ్ సీఎస్.