చరణ్ నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘రొరి’. కరిష్మా కథానాయిక. ఇటీవల చిత్రం టీజర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ ఇటీవల విడుదలైన టీజర్ అందరిని ఆకట్టుకుంది. ఈ చిత్రంలో నా పాత్ర ఎంతో డిఫరెంట్గా సర్ప్రైజింగ్గా ఉంటుంది. హైదరాబాద్లోలో జరిగే పొలిటికల్ బ్యాక్డ్రాప్ కథ ఇది.
అనుకోని పరిస్థితుల్లో పాకిస్తాన్కు వెళ్లిన కుర్రాడు అక్కడి హిందువులను కలిసి వారి కష్టాలు తెలుసుకుంటాడు. ఆ తరువాత ఆ యువకుడు ఇండియాకి క్షేమంగా వచ్చాడా? లేదా? అనేది ఈ చిత్ర కథ. ఆద్యంత ఆసక్తికరంగా వుంటుంది’ అన్నారు. కోట శ్రీనివాసరావు, జయప్రకాష్, దేవిప్రసాద్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సెసిరోలియో .