Yash | ‘కేజీఎఫ్’ సిరీస్ చిత్రాలతో పాన్ ఇండియా వైడ్గా తిరుగులేని స్టార్డమ్ను సంపాదించుకున్నాడు కన్నడ స్టార్ హీరో యష్. అయితే ‘కేజీఎఫ్-2’ తర్వాత యష్ చేయబోయే సినిమా ఎలా ఉంటుందోనని.. ఏ జానర్లో సినిమా చేస్తాడో అని దేశవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే యష్ తన తదుపరి ప్రాజెక్ట్ ‘యష్-19’ ను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. యాశ్ 19గా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ తాజాగా టైటిల్ను రివీల్ చేశారు. ‘టాక్సిక్’ (Toxic) అనే పేరుతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర బృందం ఓ స్పెషల్ వీడియో ద్వారా అనౌన్స్ చేసింది. ఇక ఈ మూవీకి జాతీయ అవార్డు గ్రహీత గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తుండగా.. కేవీన్ఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రం త్వరలోనే షూటింగ్ ప్రారంభించనుంది.
అయితే ఈ మూవీలో హీరోయిన్గా ఎవరు నటిస్తున్నారు అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. మొదట ఈ మూవీలో యశ్కు జోడీగా సాయిపల్లవి నటించనున్నట్లు టాక్ నడిచింది. ఆ తర్వాత ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటి కరీనాకపూర్ (Kareena kapoor) ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. అయితే కరీనాకపూర్ ఇందులో నటించనున్నట్లు వస్తున్న వార్తలపై తాజాగా కరీనా టీమ్ స్పందించింది. ”మీ అందరికి త్వరలోనే ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇవ్వబోతున్న అప్పటివరకు వేచి ఉండండి” అంటూ కరీనా టీమ్ వెల్లడించింది. ఇక ఈ పోస్ట్ అనంతరం నిజంగానే కరీనా యష్తో నటించబోతుందని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.