గత ఏడాది భక్తిప్రధాన ‘కన్నప్ప’ పాత్రలో ప్రేక్షకుల్ని మెప్పించారు హీరో మంచు విష్ణు. ఈ పాన్ ఇండియా చిత్రంలో మోహన్బాబు, అక్షయ్కుమార్, మోహన్లాల్, ప్రభాస్, కాజల్ వంటి అగ్ర తారలు భాగమైన విషయం తెలిసిందే.
ఈ సినిమా విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా జూన్ 27న మరోమారు ప్రేక్షకుల ముందుకుతీసుకొస్తున్నట్లు మంచు విష్ణు తెలిపారు. థియేటర్లో చూసి ఆస్వాదించాల్సిన విజువల్ ఫీస్ట్ ఇదని, పరిమిత స్క్రీన్లలో చిత్రాన్ని రీరిలీజ్ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రానికి ముఖేష్కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు.