శ్రీకాళహస్తి స్థల పురాణం ఆధారంగా మంచు విష్ణు కథానాయకుడిగా తెరకెక్కిస్తున్న భక్తిరస ప్రధాన చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడు. ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలో అగ్ర కథానాయిక కాజల్ అగర్వాల్ పార్వతీదేవి పాత్రను పోషించింది. సోమవారం పాత్ర తాలూకు ఫస్ట్లుక్ను విడుదల చేశారు. ‘ముల్లోకాలు ఏలే తల్లి..భక్తుల్ని ఆదుకునే త్రిశక్తి..శ్రీకాళహస్తిలో వెలసిన శ్రీజ్ఞాన ప్రసూనాంబిక..’ అంటూ పార్వతీదేవి వైశిష్ట్యాన్ని తెలియజెపుతూ ఫస్ట్లుక్ను ఆవిష్కరించారు.
పార్వతీదేవి పాత్రలో ప్రసన్నవదనంతో దైవత్వం మూర్తీభవించినట్లుగా కనిపిస్తున్న ఈ పోస్టర్ సోషల్మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న ‘కన్నప్ప’ చిత్రంలో మోహన్లాల్, మోహన్బాబు, ప్రభాస్, బ్రహ్మానందం, అక్షయ్ కుమార్, శరత్కుమార్ వంటి అగ్ర తారలు భాగమవుతున్నారు. భారీ వ్యయంతో మోహన్బాబు మంచు రూపొందిస్తున్నారు.