Rishab Shetty | ఒక్క సినిమా హిట్ అవ్వగానే నేను కన్నడ ఇండస్ట్రీని వదిలేయను.. ఇది నాకు అన్నం పెట్టింది.. ఇక్కడే ఉంటాను.. ఇక్కడే సినిమాలు చేస్తాను.. ఒక్క హిట్ వచ్చిందని వేరే వాళ్లలా ఇండస్ట్రీని వదిలేయను.. తాజాగా రిషబ్ శెట్టి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అసలు ఎవర్ని ఉద్దేశించి ఈయన ఈ కామెంట్ చేశాడో అర్థం కావట్లేదు. దీని గురించి కన్నడలోనూ బాగానే చర్చ జరుగుతుంది. కాంతార ఛాప్టర్ 1న టీజర్ విడుదల సందర్భంగా ఈయన చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. గతంలోనూ రిషబ్ ఇలాంటి కామెంట్స్ చేశాడు. కాంతార హిట్ తర్వాత ఇతర భాషల నుంచి తనకు చాలా ఆఫర్స్ వచ్చాయని.. భారీగా రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా కూడా తాను మాత్రం ఇక్కడే ఉండిపోయాను అన్నాడు ఈ హీరో కమ్ డైరెక్టర్. పైగా ఆ మధ్య రష్మిక మందన్న, రిషబ్ మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది.
తనను ఆదరించిన ఇండస్ట్రీ గురించి.. తనను పరిచయం చేసిన దర్శకుడి గురించి రష్మిక మందన్న ఎక్కడా చెప్పకపోవడంతో బాగా హర్ట్ అయ్యాడు రిషబ్. ఆమె మొదటి సినిమా కిరిక్ పార్టీని రిషబ్ శెట్టి తెరకెక్కించాడు. ఆ సినిమాతోనే రష్మిక పరిచయమైంది. కానీ ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కన్నడ సినిమా గురించి అస్సలు మాట్లాడలేదు రష్మిక. దానికితోడు కన్నడ నుంచి ఫేమ్ వచ్చిన తర్వాత.. ఆమె ఇతర ఇండస్ట్రీలకు వెళ్లిపోయింది. ఆ తర్వాత సొంత ఇండస్ట్రీ నుంచి అవకాశాలు వచ్చినా కూడా.. అక్కడ తనను భరించలేరంటూ బయటికి వచ్చేసింది. దాంతో కన్నడిగుల నుంచి ఒకానొక సమయంలో రష్మిక మందన్నపై చాలా వ్యతిరేకత కూడా వచ్చింది. ఇదే సమయంలో రిషబ్ శెట్టి కూడా రష్మికపై ఇన్ డైరెక్ట్ సెటైర్లు వేశాడు. కృతజ్ఞత అనేది మనసులో ఉండాలని.. అది లేనప్పుడు ఎంత చేసినా వేస్ట్ అనేశాడీయన.
“I don’t want to leave the KANNADA Film Industry after delivering one HIT like others”.
Proud ಕನ್ನಡಿಗ @shetty_rishab 💛❤️pic.twitter.com/VQVNpE9pBu
— 𝐑𝐮𝐠𝐠𝐚™ (@LoyalYashFan) November 28, 2023
కాంతార ఛాప్టర్ 1 టీజర్ రిలీజ్ టైమ్లో ఇప్పుడేమో తనకు ఫేమ్ వచ్చింది కదా అని ఇతర ఇండస్ట్రీలకు వెళ్లనంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇతరులలా తను చేయను అని చెప్పడం వెనక అసలు కారణమేంటో అర్థం కావడం లేదు. ప్రశాంత్ నీల్ సైతం కన్నడ ఇండస్ట్రీని వదిలేసి తెలుగుపై ఫోకస్ చేశాడు. ఈయన ప్రస్తుతం సలార్తో బిజీగా ఉన్నాడు.. దీని తర్వాత జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి హీరోలతోనూ ఆఫర్స్ ఉన్నాయి ఈయనకు. రిషబ్ శెట్టి మాటలు ప్రశాంత్ నీల్కు కూడా కనెక్ట్ అవుతాయి. ఆయన కూడా కన్నడ నుంచి ఫేమ్ వచ్చిన తర్వాత తెలుగు ఇండస్ట్రీకి వచ్చాడు. ప్రశాంత్ సైతం గతంలో రష్మిక లాంటి సమాధానమే చెప్పాడు.. తనను ఇప్పుడు కన్నడ సినిమా భరించలేదని చెప్పుకొచ్చాడు. ఏదేమైనా కాంతార ఛాప్టర్ 1 తర్వాత రిషబ్ శెట్టి రేంజ్ ఇంకెంత పెరుగుతుందో చూడాలి.. అప్పుడు కూడా ఈయన ఇదే మాట మీద ఉంటాడా లేదా అనేది చూడాలి.