Emergency Movie | బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut) స్వీయ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’ (Emergency). దివంగత భారత ప్రధాని ఇందిరాగాంధీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో ఇందిరాగాంధీగా కంగనా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం గతేడాది నవంబరు 24న విడుదల కావాల్సి ఉండగా.. అనుకోని కారణాల వలన విడుదల వాయిదా పడింది. ఆ తర్వాత జూన్ 14న విడుదల చేయానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ క్రమంలోనే కంగనా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం హిమచల్ ప్రదేశ్ ‘మండి’ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటి చేసి గెలవడంతో రాజకీయల్లో బిజీ అయ్యి ఈ సినిమా మళ్లీ వాయిదా పడింది.
ఇదిలావుంటే.. తాజాగా ఈ సినిమాను దసరా కానుకగా సెప్టెంబర్ 06న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే.. ఇండో – పాక్ టైంలో ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయాలు.. అలాగే భారతదేశంలో చీకటిరోజులుగా పిలువబడే ‘ఎమర్జెన్సీ’ గురించి ఈ మూవీలో చూపించబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో జయప్రకాష్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ పాత్రలో శ్రేయస్ తల్పడే కనిపించనున్నారు. జీ స్టూడియోస్, మణికర్ణిక ఫిలిమ్స్ బ్యానర్లు నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహిమా చౌదరి, మిలింద్ సోమన్, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.