గత కొద్ది రోజులుగా అందరి దృష్టి ఆఫ్ఘనిస్తాన్పైనే ఉంది. తాలిబన్లు అఫ్ఘన్ను హస్తగతం చేసుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా అది సంచలనంగా మారింది. ప్రస్తుతం అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.ఇటీవల కొందరు ప్రజలు దేశం దాటి పోవాలని విమానం రెక్కులు ఎక్కి, టైర్స్ పట్టుకొని ప్రయత్నించగా ప్రాణాలు కోల్పోయారు. ఇది ప్రతి ఒక్కరిని ఎంతగానో కదిలించింది.
ఆఫ్ఘనిస్తాన్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులని చూసి బాలీవుడ్ ప్రముఖులు తమదైన శైలిలో స్పందించారు. అయితే ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కూడా తాలిబన్స్పై మండిపడుతూ పలు పోస్ట్లు చేసింది. అయితే ఇవన్నీ మాయం కావడంతో ఆశ్చర్యం వ్యక్తం చేసింది కంగనా. తన అకౌంట్ హ్యాక్ అయిందని, ఇది కచ్చితంగా చైనా పనే అని చెప్పుకొచ్చింది కంగనా.
‘ చైనాకు చెందిన వారు నా ఇన్స్టాగ్రామ్ ఖాతాను హ్యాక్ చేసినట్లు ఇన్స్టాలో అలర్ట్ వచ్చింది. తెల్లవారుఝామున లేచి చూసే సరికి అలర్ట్ మెసేజ్తో పాటు తాలిబన్స్ గురించి పెట్టిన స్టోరీలు మాయం అయ్యాయి. కొద్ది సేపటికి నా అకౌంట్ కూడా మాయం అయింది. ఇన్స్టాగ్రామ్ నిర్వహాకులకు ఫిర్యాదు చేయడం నా అకౌంట్ తిరిగి యాక్టివేట్ అయ్యింది. ఏదైన పోస్ట్ చేద్దామని చూస్తుంటే లాగ్ అవుట్ అవుతుంది.
నా చెల్లెలి ఫోన్లో కూడా ప్రయత్నించా అలానే అవుతుంది. ఇదంత చూస్తుంటే అంతర్జాతీయ కుట్రలో భాగం అనిపిస్తుంది’ అంటూ తన పోస్ట్లో రాసుకొచ్చింది కంగనా. కంగనా చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. కాగా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలీత జీవిత కథ ఆధారం తెరకెక్కిన తలైవి చిత్రంలో కంగనా లీడ్రోల్ పోషించగా, ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.