కంచర్ల ఉపేంద్ర హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కంచర్ల’. రెడ్డెం యాదవ్ కుమార్ దర్శకుడు. మీనాక్షి జైస్వాల్, ప్రణీత కథానాయికలు. ఎస్ఎస్ఎల్ఎస్ పతాకంపై కంచర్ల అచ్యుత రావు నిర్మిస్తున్నారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘సమసమాజం రావాలనే కాన్సెప్ట్తో అభ్యుదయ భావాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం.
యువత రాజకీయాల్లోకి రావాలనే సందేశం ఉంటుంది. ప్రస్తుతం పాటలను చిత్రీకరిస్తున్నాం’ అన్నారు. యువతలో సామాజిక స్పృహను పెంపొందించే చిత్రమిదని దర్శకుడు తెలిపారు. సుమన్, అజయ్ఘోష్, కాశీ విశ్వనాథ్, సుధ, రాజా రవీంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: గుణశేఖర్, సంగీతం: కుంచె రఘు, దర్శకత్వం: రెడ్డెం యాదవ్ కుమార్.