Kamal Haasan | లోకనాయకుడు కమల్హాసన్ ట్రెండ్కు తగ్గట్టుగా కథలను ఎంచుకుంటూ యువ హీరోలకు ధీటుగా సినిమాలను చేస్తున్నాడు. ఇండియాలో ఉన్న నటులలో అత్యధిక ఎక్సపరిమెంట్స్ చేసిన హీరో ఎవరు అంటే టక్కున గుర్తోచ్చేది ఈయన పేరే. పాత్ర నచ్చితే నిడివి కూడా ఆలోచించకుండా కమల్ సినిమాలను చేస్తుంటాడు. ప్రస్తుతం ఈయన నటించిన ‘విక్రమ్’ విడుదలకు సిద్ధంగా ఉంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 3న విడుదల కానుంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులలో భారీ అంచనాలను నమోదు చేసింది. ఇదిలా ఉంటే ఈయన డేట్ల కోసం ఇద్దరు అగ్ర దర్శకులు పోటీ పడుతున్నట్లు సమాచారం.
దర్శక దిగ్గజం రాజమౌళి ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈయన నెక్స్ట్ మహేష్ బాబుతో యాక్షన్ అడ్వేంచర్ సినిమాను చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం డిసెంబర్లో షూటింగ్ ప్రారంభం కానుంది. కాగా ఈ చిత్రంలో హీరోతో సమానంగా విలన్ రోల్ ఉండనుందట. అయితే ఈ రోల్ కోసం స్టార్ యాక్టర్ను తీసుకోవాలని జక్కన్న ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే రాజమౌళి, కమల్ను విలన్ రోల్ కోసం సంప్రదించాడట. కమల్ కూడా కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
‘కేజీఎఫ్’ చిత్రాలతో కన్నడ పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన దర్శకుడు ప్రశాంత్ నీల్. ‘బాహుబలి’ తర్వాత బాలీవుడ్లో ఆ స్థాయిలో కేజీఎఫ్ హిట్టయింది. కొన్ని చోట్ల రాజమౌళి రికార్డులు కూడా కేజీఎఫ్ చిత్రం బద్దలు కొట్టింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రికార్డులను ఈ చిత్రం బ్రేక్ చేస్తూ పోయింది. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్తో సలార్ చిత్రాన్ని చేస్తున్నాడు. 35 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాదిలో విడుదల కానుంది. ఈ చిత్రం షూటింగ్ దశలో ఉండగానే ప్రశాంత్ నీల్ తన తదుపరి సినిమాను ప్రకటించాడు. సలార్ తర్వాత నీల్, ఎన్టీఆర్తో సినిమా చేయనున్నాడు. ఇటీవలే చిత్రం నుంచి విడుదలైన తారక్ పోస్టర్కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ పోస్టర్లో తారక్ ఊర మాస్ లుక్లో కనిపిస్తున్నాడు. ఇదిలా ఉంటే ప్రశాంత్ నీల్ కూడా ఈ చిత్రంలో విలన్ పాత్ర కోసం కమల్ను సంప్రదించాడట. నీల్ చెప్పిన పాత్ర కమల్కు తెగ నచ్చేసిందట. దాంతో కమల్ సినిమాను చేయడానికి ఒప్పుకున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇదే గనుక నిజమైతే ఈ రెండు చిత్రాల స్థాయి వేరే లెవల్కు వెళ్ళడం ఖాయం అంటూ నెటీజన్లు కామెంట్స్ పెడుతున్నారు.