కమల్హాసన్ నటించిన ‘విక్రమ్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సాధించిన ఘన విజయం తెలిసిందే. ఈ ఏడాది కోలీవుడ్ సూపర్హిట్గా నిలిచి కమల్ హాసన్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది. ఇటీవలే శత దినోత్సవాన్ని పూర్తి చేసుకుందీ చిత్రం. తాజాగా ఈ సినిమా మరో ఘనతను దక్కించుకుంది.
ప్రతిష్టాత్మక ‘27వ బూసాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్’లో ప్రదర్శనకు ఎంపికైంది. ఓపెన్ కేటగిరీలో ఈ సినిమాను స్క్రీనింగ్ చేయనున్నారు. ఈ నెల14వ తేదీ వరకు బూసాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జరగనుంది. దీనిపై చిత్ర నిర్మాతలు స్పందిస్తూ…‘ప్రతిష్టాత్మక బూసాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో మా సినిమా ప్రదర్శనకు ఎంపికవడం గర్వంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విజయం సాధించింది. ఇప్పుడు మాకు మరో ఘనత దక్కింది’ అన్నారు.