అగ్ర నటుడు కమల్హాసన్ ప్రస్తుతం ‘ఇండియన్-2’ చిత్రంలో నటిస్తున్నారు. శంకర్ దర్శకుడు. 1996లో విడుదలైన కల్ట్ క్లాసిక్ ‘ఇండియన్’కు రీమేక్గా తెరకెక్కిస్తున్నారు. ఎన్నో అవాంతరాలను దాటుకొని తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఓటీటీ హక్కులను ఓ ఇంటర్నేషనల్ సంస్థ దాదాపు రెండొందల కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలిసింది.
తమిళ డిజిటల్ రైట్స్ పరంగా ఇప్పటివరకు ఇదొక రికార్డ్ అని చెబుతున్నారు. వర్తమాన సామాజిక అంశాలను చర్చిస్తూ దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్ప్రీత్సింగ్, ప్రియా భవానీ శంకర్ తదితరులు ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకురానుంది.