స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ ప్రజాకవి కాళోజీ నారాయణరావు జీవితం వెండితెర దృశ్యమానమవుతున్నది. ఈ చిత్రానికి ప్రభాకర్ జైనీ దర్శకుడు. జైనీ క్రియేషన్స్ పతాకంపై విజయలక్ష్మి నిర్మిస్తున్నారు. టైటిల్ రోల్లో మూలవిరాట్ నటిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. సోమవారం ఈ సినిమా పాటలను ప్రదర్శించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘కాళోజీ జీవితం ఒక అనంత ప్రయాణం. దానిని ఓ సినిమా పరిధిలో కుదించడం చాలా కష్టం. కాళోజీ ఔన్నత్యాన్ని, వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే కొన్ని సన్నివేశాలను మాత్రమే ఉదాహరణగా తీసుకొని స్క్రీన్ప్లే రాసుకున్నా.
కాళోజీగారు తిరిగిన, జీవించిన ప్రదేశాల్లో చిత్రీకరణ జరిపాం. ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయబోతున్నాం’ అన్నారు. కాళోజీ వాడిన కళ్లజోడు, చేతి కర్రను ఆయన కుటుంబ సభ్యుల అనుమతితో సినిమాలో ఉపయోగించామని నిర్మాత విజయలక్ష్మి తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: స్వర్గీయ రవికుమార్ నీర్ల, సంగీతం: ఆత్రేయ, కథ, మాటలు, స్క్రీన్ప్లే, దర్శకత్వం: ప్రభాకర్ జైనీ.