విశ్వకార్తికేయ, ఆయూషి పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘కలియుగం పట్టణంలో’. రమాకాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వర్ రెడ్డి నిర్మాతలు. ఈ నెల 29న విడుదకానుంది. సోమవారం ట్రైలర్ను విడుదల చేశారు. లవ్, క్రైమ్, థ్రిల్లర్ అంశాలతో ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. నల్లమల ఫారెస్ట్ నేపథ్యంలో థ్రిల్లింగ్ అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
క్రైమ్ ఎలిమెంట్స్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, ఆద్యంతం అనూహ్య మలుపులతో ఉత్కంఠను పంచుతుందని దర్శకుడు తెలిపారు. సినిమా షూటింగ్ మొత్తం కడప పట్టణంలో జరిపామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: చరణ్ మాధవనేని, సంగీతం: అజయ్ అరసాడ, దర్శకుడు: రమాకాంత్ రెడ్డి.