లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దు గుమ్మ కాజల్ అగర్వాల్. ఈ సినిమా కాజల్కు పెద్దగా పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టలేకపోయింది. ‘చందమామ’ సినిమతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అనంతరం దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళీ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన ‘మగధీర’ సినిమాతో స్టార్ హీరోయిన్గా ఎదిగిపోయింది. అప్పటి నుంచి కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకోలేదు కాజల్.
గత ఏడాది కాజల్ అగర్వాల్ ..గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకోగా, వారిద్దరు ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడప్పుడు తన భర్తతో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేస్తూ నెటిజన్స్ని ఎంటర్టైన్ చేస్తుంటుంది. అయితే కాజల్ తన భర్తతో పాటు స్క్రీన్ షేర్ చేసుకోవాలని అనుకుంటుందట. అందుకోసం దర్శక నిర్మాతలకు కీలక పాత్రలో నటించే ఛాన్స్ ఇవ్వమని చెబుతుందట.
పెళ్లి తర్వాత ఫుల్ స్పీడ్ పెంచిన కాజల్ వైవిధ్యమైన పాత్రలు పోషిస్తుంది. నాగ్ సినిమాలో వేశ్యగా కనిపించనుందట. స్పైగా కనిపిస్తూనే ఉగ్రవాదుల సీక్రేట్స్ తెలుసుకోడానికి వేశ్యగా కనిపించే పాత్ర ఇది. నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాలో కాజల్ తన పాత్రతో ప్రేక్షకులని ఎంతగానో మెప్పిస్తుందని అంటున్నారు.