టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీకి వచ్చి 16 సంవత్సరాలు పైనే అయింది. ఎన్నో వైవిధ్యమైన చిత్రాలు చేసిన కాజల్ ఇప్పుడు లేడి ఓరియెంటెడ్ సినిమాలకు సై అంటుంది. అలానే వెబ్ సిరీస్లలోను నటిస్తుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన ఆచార్య చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే నాగార్జున, ప్రవీణ్ సత్తారు మూవీలో కూడా కాజల్ హీరోయిన్ గా ఫిక్స్ అయింది. త్వరలో ఈ చిత్ర షూటింగలో పాల్గొననుంది.
‘ఉమ’, ‘ఘోస్టీ’, ‘కరుంగాప్పియమ్’, ‘హే సినామిక’ షూటింగ్లను పూర్తి చేయగా, త్వరలో అవి విడుదల కానున్నాయి. అయితే ఈ అమ్మడు శ్రావణమాసం కావడంతో తమ దాంపత్య జీవితం బాగుండాలని ‘హర్యాలీ తీజ్’ వేడుక కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకుంది. అంతేకాదుఆ వేడుకకి సంబంధించిన ఫొటోలు షేర్ చేసింది.
అలానే తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఈ క్రమంలో ఓ అభిమాని ఎన్ని రోజులు మీరు సినిమాలు చేస్తారని అడగగా, దానికి స్పందించిన కాజల్ .. ‘నేను ఎంతకాలం సినీ రంగంలో కొనసాగుతానో నాకు తెలియదు. నా భర్త సినీ రంగం నుంచి తప్పుకోవాలని కోరిన మరుక్షణమే నటనకు గుడ్బై చెప్పేస్తాను. నా భర్త మాటకు విలువ ఇచ్చేలా నడుచుకుంటాను’.. అని కాజల్ అగర్వాల్ తెలిపింది. ఆమె మాటలు అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. గతంలోను కాజల్ తన కెరియర్పై స్పందించిన విషయం తెలిసిందే.