దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘కాంత’. సెల్వమణి సెల్వరాజ్ దర్శకుడు. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. శుక్రవారం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా కథానాయిక భాగ్యశ్రీ బోర్సే ఫస్ట్లుక్ను విడుదల చేశారు. ఇందులో ఆమె సంప్రదాయ వస్త్రధారణతో కనిపిస్తున్నది. ‘1950 మద్రాస్ నేపథ్యంలో నడిచే కథాంశమిది. ఆనాటి మానవ సంబంధాలు, సామాజిక సంక్లిష్టతలకు అద్దం పడుతుంది. భాగ్యశ్రీ బోర్సే పాత్రకు కథాగమనంలో చాలా ప్రాముఖ్యత ఉంటుంది’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: జాను, నిర్మాతలు: రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్, దర్శకత్వం: సెల్వమణి సెల్వరాజ్.