K.G.F Chapter-2 business | కన్నడ సినిమాను అంతర్జాతీయ స్థాయికి పరిచయం చిత్రం ‘కేజీఎఫ్’. అప్పటివరకు కన్నడ సినిమాలను ఇతర ఇండస్ట్రీ వాళ్ళు అంతగా పట్టించుకునే వారు కాదు. అలాంటి సమయంలో కేజీఎఫ్ చిత్రం ప్రభంజనం సృష్టించింది. ఎలాంటి అంచనాల్లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విడుదలైన ప్రతి ఏరియాలో వసూళ్ళ సునామీని సృష్టించింది. ‘బాహుబలి’ తర్వాత ఆ స్థాయిలో ‘కేజీఎఫ్’ చిత్రం బాలీవుడ్లో జెండా పాతింది. అప్పటివరకు ఇండియన్ సినిమాలో అలాంటి ఎలివేషన్లు ఎక్కడా చూడలేదు. ప్రశాంత్ నీల్ టేకింగ్కు, విజన్కు సినీప్రముఖులు సైతం అశ్చర్యంలో పడ్డారు. అప్పటివరకు అసలు మొహం కూడా తెలియని యష్ ఈ చిత్రంతో పాన్ ఇండియా స్టార్గా ఎదిగాడు. ఈ చిత్రంలో యష్ నటన, ఆటిట్యూడ్కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. కేజీఎఫ్ సీక్వెల్ కోసం కన్నడతో పాటు ప్రతి సినీ ప్రేక్షకుడు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రేక్షకుల నిరీక్షణకు ఫలితంగా ‘కేజీఎఫ్ చాప్టర్-2’ ఏప్రిల్ 14న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ క్రమంలో ప్రతి ఏరియాలో ఈ చిత్రం భారీగా బిజినెస్ను జరుపుకుంది. ఈ చిత్ర టోటల్ బిజినెస్ ఒకసారి గమనిస్తే
ఏపి+తెలంగాణ : 78 కోట్లు
కర్ణాటక : 27 కోట్లు
తమిళనాడు: 27 కోట్లు
కేరళ : 10 కోట్లు
హిందీ+రెస్ట్ ఆఫ్ ఇండియా : 100 కోట్లు
ఓవర్సీస్ : 30 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ : 345 కోట్లు
కేజీఎఫ్ చాప్టర్-2 చిత్రానికి వరల్డ్ వైడ్గా రూ. 345 కోట్ల భారీ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర హిట్ అవ్వాలంటే రూ. 347 కోట్ల వరకు షేర్ సాధించాల్సి ఉంటుంది. బాహుబలి-2,రోబో2.0, ఆర్ఆర్ఆర్ తర్వాత ఆ స్థాయిలో బిజినెస్ జరుపుకున్న చిత్రంగా కేజిఎఫ్ చాప్టర్-2 నిలిచింది. అంతే కాకుండా ఒక డబ్బింగ్ సినిమాకు ఈ స్థాయిలో తెలుగులో బిజినెస్ జరగడం ఇదే మొదటి సారి. మొదటి నుంచే ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే విడుదలైన ట్రైలర్ అంచనాలను రెట్టింపు చేసింది. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలకపాత్రలో నటించాడు.