మూడేళ్ల కిందటి వరకు సెప్టెంబర్ 2 వచ్చిందంటే నందమూరి కుటుంబానికి ఒక పండగలా ఉండేది. మరీ ముఖ్యంగా హరికృష్ణ కుటుంబం అయితే ఎంతో ఆనందంగా గడిపేది. దానికి కారణం ఆ రోజు ఆయన జన్మదినం. కానీ ఒకే ఒక్క సంఘటన ఈ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది. సరిగ్గా మూడేళ్ల కిందట జన్మదినానికి మూడు రోజుల ముందు ఆగస్టు 29, 2018న రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు హరికృష్ణ. అప్పటికే అన్నయ్య జానకీరామ్ను యాక్సిడెంట్లో పోగొట్టుకున్న ఎన్టీఆర్, కళ్యాణ్రామ్.. తండ్రిని కూడా అదే తరహాలో కోల్పోయారు. ఇదిలా ఉంటే.. ఇదిలా ఉంటే తాజాగా సెప్టెంబర్ 2 హరికృష్ణ జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మరోసారి నాన్నను గుర్తు చేసుకున్నాడు.
చిన్నప్పటి నుంచి తన తండ్రి హరికృష్ణతో ఉన్న మధుర స్మృతులను అభిమానులతో పంచుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. మరీ ముఖ్యంగా చిన్నప్పుడు తనకు క్రికెట్ అంటే ఎంతో ఆసక్తి ఉండేదని.. స్కూల్కు కూడా వెళ్లకుండా క్రికెట్ చూసిన రోజులు కూడా ఉన్నాయని చెప్పాడు జూనియర్. తను క్రికెట్కు బానిస అయిపోతున్నాడని గమనించిన తన తండ్రి.. ఆ అలవాటు పోగొట్టడానికి చేసిన ప్రయత్నం గురించి చెప్పుకొచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. చిన్నప్పుడు టీవీలో క్రికెట్ చూస్తుంటే.. తన తండ్రి హరికృష్ణ ఒక వీసీఆర్ తీసుకొచ్చి అందులో కూడా క్రికెట్ చూపించేవాడని చెప్పాడు. కాకపోతే అందులో అప్పటికి అయిపోయిన మ్యాచ్ ఉండేదని.. ఒకే క్రికెట్ మ్యాచ్ రెండు మూడు సార్లు చూసి తనకు క్రికెట్ అంటేనే ఆసక్తిపోయింది అని తెలిపాడు జూనియర్.
ఇప్పుడు క్రికెట్ చూడటానికి కూడా తనకు పెద్దగా ఆసక్తి లేదు అంటున్నాడు. ఆ అలవాటు పోవడానికి కారణం మాత్రం తన తండ్రి హరికృష్ణ అని చెప్పాడు జూనియర్ ఎన్టీఆర్. కేవలం ఇది మాత్రమే కాదు ఇంకా ఎన్నో మధురమైన జ్ఞాపకాలు తనకు వదిలేసి వెళ్లిపోయాడు అంటున్నాడు జూనియర్. ఆయన ఎక్కడున్నా మమ్మల్ని పైనుంచి ఆశీర్వదిస్తూనే ఉంటాడు అంటున్నాడు నందమూరి తారక రామారావు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ట్రిపుల్ ఆర్ సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, ప్రశాంత్ నీల్ లతో సినిమాలకు కమిట్ అయ్యాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ పాడిన ‘దర్శనం మొగులయ్య’ వాడే వాద్య పరికరం ఏంటో తెలుసా?
Mogulaiah | పవన్ కల్యాణ్ భీమ్లానాయక్ టైటిల్ సాంగ్ పాడిన ఈయన ఎవరు ? నేపథ్యమేంటి ?
Trisha: మరోసారి వార్తలలోకి త్రిష పెళ్లి.. ఇది నిజం అంటున్న నెటిజన్స్
12 నిమిషాలలో అందంగా రెడీ అయ్యానంటూ మంచు లక్ష్మీ పోస్ట్