NTR 30 | ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. జాన్వీకపూర్ కథానాయిక. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. విస్మరణకు గురైన తీర ప్రాంత నేపథ్య కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చావుకి, దేవుడికి భయపడని మృగాల్లాంటి మనుషులతో ఓ ధీరోదాత్తుడి పోరాటం ఏమిటన్నదే చిత్ర కథాంశమని దర్శకుడు కొరటాల శివ సినిమా ప్రారంభోత్సవం సందర్భంలో తెలిపారు.
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంతో కనిపించనున్నారని తెలిసింది. కథానుగుణంగా భిన్న పార్శాల్లో ఈ పాత్రలు సాగుతాయని..ఆయన లుక్స్ కూడా వైవిధ్యంగా ఉంటాయని చెబుతున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి. అనిరుధ్ సంగీతాన్నందిస్తున్నాడు.