Nandamuri harikrishna | నందమూరి తారకరామారావు నట వారసుడు హరికృష్ణ (Hari krishna)నటుడిగాను, రాజకీయ నాయకుడిగాను ఎంతో మంది మనసులు గెలుచుకున్నారు. తెలుగు చిత్రసీమలో తొలి నటవారసునిగా నిలిచిన నందమూరి హరికృష్ణ ‘శ్రీకృష్ణావతారం’లో నటించి అలరించారు. నటుడిగా, నిర్మాతగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వైవిధ్యమైన పాత్రలు పోషించిన హరికృష్ణ రాజకీయాలలోను సత్తా చాటారు. కాగా నేడు నందమూరి హరికృష్ణ (Nandamuri Hari krishna Birthday) 67వ జయంతి. ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు నందమూరి అభిమానులు ఆయనని స్మరించుకుంటున్నారు. తాజాగా తన తండ్రిని స్మరించుకుంటూ జూనియర్ ఎన్టీఆర్ (Junior Ntr) కూడా ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు.
నాన్న మీ 67వ జయంతిన మిమ్మల్ని స్మరించుకుంటూ…”ఈ అస్తిత్వం మీరు. ఈ వ్యక్తిత్వం మీరు. మొక్కవోని ధైర్యంతో కొనసాగే మా ఈ ప్రస్థానానికి నేతృత్వం మీరు. ఆజన్మాంతం తలుచుకునే అశ్రుకణం మీరే” ఇట్లు మీ నందమూరి కళ్యాణ్ రామ్, నందమూరి తారకరామరావు అని జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్విట్ చేశారు. కాగా ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ అవుతుంది.
మీ 67వ జయంతి న మిమ్మల్ని స్మరించుకుంటూ… pic.twitter.com/MwPWPJ8VMD
— Jr NTR (@tarak9999) September 2, 2023
తండ్రి యన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన హిందూపూర్ నియోజకవర్గం నుండి నందమూరి హరికృష్ణ 1996లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంతకు ముందు చంద్రబాబు మంత్రివర్గంలో ట్రాన్స్ పోర్ట్ మినిష్టర్ గానూ పనిచేశారు. 2008లో రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. మధ్యలో నటనకు దూరంగా ఉన్న హరికృష్ణతో ‘శ్రీరాములయ్య’లో ఓ కీ రోల్ పోషింప చేశారు దర్శకుడు ఎన్.శంకర్. తరువాత వైవిఎస్ చౌదరి తన ‘సీతారామరాజు’లో హరికృష్ణను, ఏయన్నార్ నటవారసుడు నాగార్జునను కలిపి తెరకెక్కించారు. ఇద్దరు మహానటుల వారసుల చిత్రం కాబట్టి, ఈ సినిమా జనాన్ని అలరించింది.
కృష్ణతో కలసి హరికృష్ణ నటించిన ‘శ్రావణమాసం’ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తరువాత మళ్ళీ హరికృష్ణ కెమెరా ముందుకు రాలేదు. ఆయనకు ముగ్గురు కుమారులు కాగా, వారి పేర్లు జానకిరామ్, కళ్యాణ్ రామ్, తారకరామ్. వీరిలో కళ్యాణ్, తారక్ ఇద్దరూ నటనలో రాణిస్తున్నారు. ఆయన పెద్ద కొడుకు జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. తరువాత నాలుగేళ్ళకే హరికృష్ణ కూడా రోడ్డు ప్రమాదంలోనే మరణించడం విచారకరం.