హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ (NTR) వర్ధంతి సందర్భంగా ఆయన మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR) నివాళులర్పించారు. గురువారం తెల్లవారుజామున సోదరుడు కల్యాణ్రామ్తో (Kalyan Ram) కలిసి హైదరాబాద్లోని ట్యాంక్బండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ ఘాట్కు చేరుకున్న తారక్.. ఆయన సమాధి వద్ద పుష్పగుచ్చాలు ఉంచి అంజలి ఘటించారు. మరోవైపు.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించేందుకు భారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులు, ఎన్టీఆర్ అభిమానులు చేరుకోవడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొన్నది.
కాగా, ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏర్పాటుచేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను బాలకృష్ణ అభిమానులు తొలగించడం వివాదానికి దారితీసింది. తెల్లవారుజామున ఎన్టీఆర్.. తాతకు నివాళులర్పించి వెళ్లారు. అనంతరం అక్కడికి కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులతో కలిసి బాలకృష్ణ చేరుకున్నారు. ఆయన అంజలి ఘటించిన వెళ్లిన తర్వాత.. టీడీపీ కార్యకర్తలు, బాలకృష్ణ అభిమానులు.. అక్కడున్న తారక్ ఫ్లెక్సీలు, కటౌట్లను తొలగించి పక్కకు పెట్టారు. దీనిపై ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
VIDEO | Actor @tarak9999 pays tributes to former Andhra Pradesh CM Nandamuri Taraka Rama Rao on his 28th death anniversary at NTR Ghat in Hyderabad. pic.twitter.com/cR5kRoaPT0
— Press Trust of India (@PTI_News) January 18, 2024