Jithender Reddy | రాకేష్ వర్రె హీరోగా విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘జితేందర్ రెడ్డి’. ముదుగంటి క్రియేషన్స్ పతాకంపై ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. త్వరలో విడుదలకానుంది. ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ వేడుకను బుధవారం నిర్వహించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘1980కాలంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా తీశాం.
ఓ ప్రజానాయకుడిగా జితేందర్ రెడ్డి పాత్ర ప్రతి ఒక్కరికి గుర్తుండిపోతుంది. చరిత్రలో జరిగిన నిజాల్ని ఈ సినిమాలో చూపిస్తున్నాం’ అన్నారు. నిర్మాత రవీందర్ రెడ్డి తన అన్న జితేందర్ రెడ్డి కథను ప్రజలకు చెప్పాలనే లక్ష్యంతో ఈ సినిమా తెరకెక్కించాడని, తన పాత్రకు మంచి పేరొస్తుందని హీరో రాకేష్ వర్రె తెలిపారు. ప్రజలను కలుసుకొని ఎన్నో విషయాలను సేకరించి ఈ సినిమా తీశానని దర్శకుడు విరించి వర్మ చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: వి.ఎస్.జ్ఞానశేఖర్, సంగీతం: గోపి సుందర్, దర్శకత్వం: విరించి వర్మ.