సినీ వినీలాకాశంలో ధృవతారగా వెలుగొందిన శ్రీదేవి కూతురిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అందాల ముద్దుగుమ్మ జాన్వీ కపూర్. టీనేజ్లో ఉన్నప్పుడే తన అందాలను చూపిస్తూ రచ్చ చూపించిన ఈ భామ ఇప్పుడు నిత్యం గ్లామర్ షోతో హీటెక్కిస్తుంది. జాన్వీ హాట్ షోకి కుర్రకారుకి నిద్ర పట్టడం లేదు. పాత్రకు పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలనే చేస్తూ వస్తున్న జాన్వీ కపూర్ గత ఏడాది ‘గుంజాన్ సక్సేనా: ద కార్గిల్ గర్ల్’ అనే బయోపిక్ మూవీలో నటించి మెప్పించింది. ఇక, ఇటీవల ‘రూహీ’ అనే సినిమా చేసింది. అయితే, ఇది మాత్రం జాన్వీకి నిరాశనే మిగిల్చింది.
తాజాగా జాన్వీ కపూర్ విమానాశ్రయం నుండి బయటకు వస్తుండగా,ఫొటోగ్రాఫర్స్ ఆమెని కెమెరాలో బంధించారు. ఆ సమయంలో జాన్వీ కపూర్ చేతికి కట్టుతో కనిపించింది. ఆమె చేతికి గాయం ఎలా అయ్యిందని.. ఎందుకు అంతపెద్ద కట్టు ధరించాల్సి వచ్చిందని అక్కడే విలేకర్లు ప్రశ్నించగా.. జాన్వీ కపూర్ ఎలాంటి సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోయింది. దీంతో జాన్వీ కపూర్కి ఏం జరిగిందని నెటిజన్స్ ఆందోళన చెందుతున్నారు. జాన్వీ కపూర్ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి ‘గుడ్ లక్ జెర్రీ’. ఇది తమిళంలో సూపర్ హిట్ అయిన ‘కలమావు కోయిల’కు రీమేక్. మరో చిత్రం ‘దోస్తానా 2′ కూడా చేస్తోంది. అలాగే, ఇటీవలే బోనీ కపూర్ నిర్మిస్తోన్న ‘మిలీ’ సినిమా షూటింగ్ను కూడా పూర్తి చేసుకుంది.