Actress Jayasudha | పదమూడేళ్ళ వయసులోనే సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి, తన సహజ నటనతో ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు జయసుధ. 1972లో వచ్చిన ‘పండంటి కాపురం’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన ఈమె అనతి కాలంలోనే అప్పటి అగ్ర కథానాయకులతో జోడీ కట్టి స్టార్ హీరోయిన్గా వెలుగొందింది. ఐదు దశాబ్ధాల పాటు నటిగా ఎన్నో వైవిధ్య భరిత పాత్రలు పోషించి సినీ ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంది. ప్రస్తుతం ఈమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ బిజీగా గుడుపుతుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ బాషల్లోనూ సినిమాలు చేస్తుంది.
ఇదిలా ఉంటే తాజాగా జయసుధ మూడో పెళ్లి చేసుకుందన్న వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి. కొన్ని రోజులు క్రీతం అమెరికా వెళ్లిన జయసుధ అక్కడి బిజినెస్ మ్యాన్ను సీక్రెట్గా వివాహాం చేసుకుందని పలు వెబ్సైట్లలో వార్తలు వచ్చాయి. అంతే కాకుండా ఈ మధ్య జయసుధ ఎక్కడికి వెళ్ళిన అతన్ని వెంటపెట్టుకుని వస్తుంది. దాంతో ఆ వార్తలు మరింత వైరల్ అయ్యాయి. కాగా తాజాగా జయసుధ తనపై వస్తున్న వార్తలను ఖండించింది. అందులో ఏమాత్రం వాస్తవం లేదని. అతను అమెరికాకు చెందిన వ్యక్తి అని, తన బయోపిక్ తీసేందుకే ఇండియాకు వచ్చాడని స్పష్టం చేసింది.
ఇండస్ట్రీలో తన ప్రాముఖ్యతను తెలుసుకోవడానికి తనతోనే ఉంటూ గమనిస్తున్నాడని పేర్కొంది. అంతేకాకుండా స్పిరిచ్యువల్ బయోపిక్ కావడంతో నేను క్రిస్టియానిటీలోకి ఎలా మారాను? అంతకుముందు నా జీవితం ఎలా ఉండేది అని తెలుసుకుంటున్నాడంటూ పెళ్ళి వార్తలపై క్లారిటీ ఇచ్చింది.