షారుఖ్ఖాన్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో రూపొందిన ‘జవాన్’ చిత్రం గురించి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా కన్నడ వెర్షన్కు యష్, మలయాళ వెర్షన్కు పృథ్వీరాజ్ సుకుమారన్ డబ్బింగ్ చెప్పారని తెలిసింది.
షారుఖ్ఖాన్ పాత్రకు వీరు చెప్పిన డబ్బింగ్ ప్రత్యేకాకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు. ఈ సినిమా తమిళ వెర్షన్కు కూడా ఓ అగ్రహీరో డబ్బింగ్ చెప్పబోతున్నారని సమాచారం. షారుఖ్ఖాన్ తొలి అధికారిక పాన్ ఇండియా చిత్రంగా ‘జవాన్’ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నది.