బిగ్ బాస్ హౌజ్లో ప్రతి సీజన్లోను కొన్ని గ్రూప్లు ఏర్పడడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ సారి సిరి, షణ్ముఖ్, జస్వంత్ జట్టుగా ఏర్పడి గేమ్గా ఆడారు. వీరిని త్రిమూర్తులుగా పిలుస్తూ వచ్చారు. అనారోగ్యంతో జస్వంత్ బయటకు వెళ్లడంతో సిరి, షణ్ముఖ్ కలిసి కట్టుగానే ఆడుతూ కాస్త అతి చేస్తున్నారు. దీనిపై తాజా ఎపిసోడ్లో జస్వంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
నీకు, సిరికి ఎలాంటి బాండింగ్ ఉందో నాకు తెలుసు. కానీ జనాలు ఏమనుకుంటున్నారు? అని ఎప్పుడైనా ఆలోచించావా? అని షణ్ముఖ్ని ప్రశ్నించాడు జస్వంత్. దీనిపై స్పందించిన ఫ్యామిలీస్ ఇంట్లోకి వచ్చినప్పటినుంచి నాకూ ఈ ప్రశ్న ఎదురైంది. అది తప్పే, కానీ సిరి నా బెస్ట్ఫ్రెండ్.. జీవితాంతం ఆమెకు సపోర్ట్గా ఉంటాను అని అన్నాడు. ఇక సిరిని కూడా నిలదీసాడు జస్వంత్.
బిగ్బాస్ హౌస్లోకి గేమ్ ఆడటానికి వెళ్లావు కదా! కానీ నువ్వు గేమ్ మీద శ్రద్ధ తగ్గించి ఎమోషనల్ కనెక్ట్ అవుతున్నాను అదీఇదీ అంటూ పిచ్చెక్కిపోతున్నావు, నీకిది అవసరమా? అని జెస్సీ ప్రశ్నించగా, దానికి సిరి.. గేమ్ ఆడటానికే వచ్చాను. మధ్యలో కొన్నికొన్ని ఎమోషన్స్ తీసుకుంటున్నాను. కానీ గేమ్లో ఎమోషనల్ కనెక్ట్ అయితే అవసరం లేదు. బయటకు వచ్చాక నీకు ఉంటది రా అంటూ చాలా సరదాగా సమాధానం ఇచ్చింది.