భారీ స్థాయిలో రెస్పాన్స్ను అందుకుంటూ దేశంలోనే నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. గతంలో ఎప్పుడూ చూడని కాన్సెప్టుతో వచ్చినా.. ప్రేక్షకులు దీనికి ఊహించని రీతిలో ఆదరణను అందించారు. ఫలితంగా వరుస సీజన్స్ జరుపుకుంటుంది బిగ్ బాస్. తెలుగులో నాలుగు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం ప్రస్తుతం సీజన్ 5 జరుపుకుంటూ ఉంది.
ఈ సీజన్ చివరి దశకు చేరుకోవడంతో చిత్ర విచిత్రమైన టాస్కులు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో షోలో రొమాన్స్ కూడా శృతి మించుతుంది. ముఖ్యంగా సిరి-షణ్ముఖ్లు ఏం చేస్తున్నారో కూడా ఎవరికి అర్ధం కాని విధంగా ఉంది. ఆ మధ్య షణ్ముఖ్ కోసం సిరి గోడకు తల కొట్టుకోవడం, కోసుకోవడం చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. దీనిపై నాగ్ వారిద్దరిని గట్టిగానే మందలించాడు.
ఇదే విషయంపై స్పందించిన జస్వంత్.. సిరి తలను గోడకేసి గుద్దుకోవడం తనకు ఏమాత్రం నచ్చలేదని, ఆ సమయంలో తాను గనుక అక్కడ ఉండి ఉంటే..సిరి చెంప పగులకొట్టేవాడినంటూ కామెంట్స్ చేశాడు. ఇప్పుడు ఆయన కామెంట్స్ వైరల్గా మరాయి. జస్వంత్ హౌజ్లో ఉన్నప్పుడు సిరి, షణ్ముఖ్లతో కలిసి గేమ్ ఆడిన విషయం తెలిసిందే. త్రిమూర్తులుగా పేరు తెచ్చుకున్నారు వీరు. అనారోగ్య సమస్యల వలన జస్వంత్ హౌజ్ నుండి బయటకు వచ్చిన విషయం విదితమే. ఏదేమైన సిరి-షణ్ముఖ్ వ్యవహారం ఎవరికి ఓ పట్టాన అర్ధం కావడం లేదు.