కార్తీ కథానాయకుడిగా రూపొందిస్తున్న చిత్రం ‘జపాన్’. రాజు మురుగన్ దర్శకుడు. ఎస్.ఆర్.ప్రకాశ్బాబు, ఎస్.ఆర్.ప్రభు నిర్మాతలు. కార్తీ 25వ చిత్రమిది. ట్రైలర్ లాంచ్ ఆదివారం చెన్నయ్లో గ్రాండ్గా జరిగింది. సూర్య, విశాల్, తమన్నా, ఆర్య, జయం రవి, లోకేశ్ కనకరాజ్, పా.రంజిత్ తదితరులు ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరై చిత్ర యూనిట్కి శుభాకాంక్షలు అందించారు.. ఇందులో కార్తీ బంగారు ఆభరణాలు కాజేసే దొంగగా కనిపిస్తారని, ఆయన నటన అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ ఆకట్టుకునే రీతిలో ఉంటుందని, వాణిజ్యహంగులతో పాటు ఆద్యంతం హాస్య ప్రధానంగా అలరిస్తుందని మేకర్స్ తెలిపారు.
అను ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్, విజయ్ మెల్టన్ ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్.రవివర్మన్, సంగీతం: జి.వి.ప్రకాశ్కుమార్.