న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి జాన్వీ కపూర్(Janhvi Kapoor).. ముంబైలో జరిగిన మైదాన్ ఫిల్మ్ స్క్రీనింగ్కు హాజరైంది. ఆ చిత్రాన్ని జాన్వీ తండ్రి బోనీ కపూర్ ప్రొడ్యూస్ చేశారు. ఆ స్క్రీనింగ్ ఈవెంట్కు వైట్ పాంట్సూట్లో వచ్చిన జాన్వీ చాలా స్పెషల్గా కనిపించింది. ధగధగలాడే నక్లెస్ను ఆమె ధరించింది. అయితే ఆ హారంపై భాయ్ఫ్రెండ్ షీకూ పేరు రాసి ఉన్నట్లు గుర్తించారు. జాన్వీ భాయ్ఫ్రెండ్ శిఖర్ పహరియా ముద్దు పేరు షీకూ. ఇటీవల కరణ్ జోహార్తో జరిగిన కాఫీ విత్ కరణ్ 8 షోలో షీకూ గురించి జాన్వీ చెప్పింది. స్పీడ్ డయల్ లిస్టులో ఉన్న ముగ్గురు పేర్లు చెప్పాలని కోరగా, షీకూ పేరును జాన్వీ చెప్పింది.
శిఖర్ పహరియాతో ఉన్న రిలేషన్ గురించి కరణ్ జోహార్ తన ఛాట్ షోలో అడిగాడు. మీ ప్రేమ వ్యవహారం చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని, తొలుత శిఖర్తో డేటింగ్ చేశారని, ఆ తర్వాత మరొకరితో డేటింగ్ చేశారని, మళ్లీ ఇప్పుడు శిఖర్తో డేటింగ్ చేస్తున్నారని, ఇది నిజమా లేక అబద్ధమా అని జాన్వీని కరణ్ అడిగాడు. , దాని జాన్వీ బదులిస్తూ.. నాదాన్ పరిందే ఘర్ ఆజా సాంగ్ను తన కోసం షీకూ పాడి వినిపించేవాడని ఆమె అన్నారు. శిఖర్ తనకు ముందు నుంచి ఫ్రెండ్గా ఉన్నాడని, తన నుంచి అతను ఏదో ఆశిస్తున్నాడని అనుకోవడం లేదని, ఎటువంటి స్వార్థం లేకుండా అతను తనతో ఉన్నట్లు జాన్వీ చెప్పింది.